Thursday, April 18, 2024

Video: ప్రకృతి కాంత పరవశం.. విరబూసిన నీలకురింజి..

పన్నెండేళ్లకోసారి పూసే ‘నీలకురింజి’ పువ్వులు ఈ ఏడాది విరబూశాయి. దక్షిణాదిన పశ్చిమ కనుమల్లో షోల అడవుల్లో ఉంటాయి ఈ మొక్కలు. కేరళలోని సంతానపర పంచాయతీ పరిధిలోని ఇడుక్కిలోని శలోం కున్ను (శలోం కొండలు)ల్లో నీలకురింజి పువ్వులు కనువిందు చేస్తున్నాయి.

వాన చినుకు పడితే ఆకులు చిగురిస్తాయి. పువ్వులు వికసిస్తాయి. ఒక్కో పువ్వుది ఒక్కో స్పెషాలిటీ. అందంలోను..సువాసనలో కూడా వేటి ప్రత్యేకతలు వాటివే. అయితే అరుదైన పువ్వులు కూడా ఈ ప్రకృతిలో ఉంటాయి.. అవి కొన్ని ఏరియాలకే పరిమితమై ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు ఆయా రకాలు పువ్వులు ప్రత్యేకతను తెస్తాయి. అటువంటి అందమైన, అద్భుతమైన, అరుదైన పువ్వు ‘నీలకురింజి’.

నీలకురింజి పువ్వులను చూడాలంటే 12 ఏళ్లు పడుతుంది. రూపంలోనే కాదు గుణంలో కూడా ఈ పువ్వు చాలా స్పెషాలిటీ. అంతేకాదు.. ఈ పువ్వు పేరుతో ఓ టెంపుల్ కూడా ఉంది అంటే.. నీలకురింజి పువ్వుల విలువ గురించి అర్థం చేసుకోవాల్సిందే. గుబురు పొదకు చెందిన చిన్న మొక్క నీలకురంజి. ఇది దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో షోల అడవుల్లో కనిపిస్తుంది. ఇది నీలి రంగులో ఉంటుంది కాబట్టి దీన్ని నీలకురింజి అని పిలవటం ప్రసిద్ధి చెందింది. ఈ మొక్క పువ్వుల అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి నీలకురింజి పువ్వులో కేరళలోని సంతానపర పంచాయతీ పరిధిలోని ఇడుక్కిలోని షాలోం కున్నులు (షాలోం కొండలు) ఈ ఏడాది విరబూసి కనువిందు చేస్తున్నాయి. వాటిని చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. అంత అందం వీటి సొంతం.

దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడులోని పశ్చిమ కనుమలలోని షోలా అడవులలో కనిపించే ఒక పొద నీలకురింజి మొక్క. నీలగిరి కొండలు అంటే నీలకురింజి మొక్కలు అక్కడ పూస్తాయి కాబట్టి ఆ పర్వతాలను ఈ పేరు వచ్చిందట. అటువంటి అద్భుతమైన నీలకురింజి పువ్వులు 12 సంవత్సరాల తర్వాత శలోం కొండలలో విరిసిన కొండలకు నీలి రంగును పులిమాయి. శలోం కొండలలో ఈ ఏడాది 10ఎకరాలకుపైగా ప్రాంతంలో విరబూశాయి. ఈ పువ్వులు విరబూసిన సమయంలో వాటిని చూసేందుకు పర్యాటకు భారీగా తరలి వస్తారు. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఈ సంవత్సరం పర్యాటకులను అనుమతించడం లేదు.

- Advertisement -

కాగా, ఈ మొక్క 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే ఈ పువ్వులు పూసే సమయంలో ఈ మొక్కలు ఉండే ప్రాంతం అంతా నీలాకాశం కిందకు దిగి వచ్చిందా? అన్నట్లుగా నీలిరంగులోకి మారిపోతుంది. ప్రకృతిలోని అందం మొత్తం అక్కడే కొలువు తీరిందా? అన్నట్లుగా ఉంటుంది. ఈ మొక్కలు కేరళలోని మున్నార్, తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతాల్లో పూస్తాయి. పశ్చిమ కనుమల్లో ఎక్కువగా పూసే ఈ మొక్కలు తూర్పు కనుమల్లో మాత్రం అక్కడక్కడా కనిపిస్తాయి.

కురింజు పువ్వు పేరుతో దేవాయలం..
కురింజి పువ్వు పేరుతో ఉండే దేవాలయం హిల్ స్టేషన్ అయిన కొడైకెనాల్ లో ఉందీ కురింజి అండవర్ దేవాలయం కొడైకెనాల్ సరస్సుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాయలంలో శ్రీ కురింజి ఈశ్వరన్ అని పిలవబడే మురుగన్ ఉంటాడు. అంటే సుబ్రమణ్యస్వామి. కురింజి అంటే పర్వతం అని అర్థం. అండవర్ అంటే దేవత లేదా దేవుడు అని అర్థం. కురింజి అండవార్ అంటే పర్వత దేవుడు అని అర్థం. కుమారస్వామి కైలాసం నుంచి మొదటిసారి భూమిపైకి వచ్చినప్పుడు ఈ పర్వతం మీదనే దిగాడట. అప్పుడు కుమారస్వామి భార్య వల్లీ ఆయన్ని 12 ఏళ్లకు ఒక్కసారి పూసే నీలకురంజి పువ్వుల దండతో మెడలో వేసి స్వాగతం పలికిందని పురాణాలు చెబుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement