Thursday, April 25, 2024

జాతీయ‌ద‌ళాల్లో ప‌ని చేసిన పైల‌ట్లు,మెకానిక్ ల‌ను సైన్యంలో చేర్చుకుంటున్నాం..తాలిబ‌న్లు..

తాలిబ‌న్లు ఆఫ్గ‌నిస్థాన్ ని చేజిక్కించుకుని త‌మ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. త‌మ పాల‌న ప్రారంభ‌మైన త‌ర్వాత 250మంది సైనికుల‌కు శిక్ష‌ణ కూడా ఇచ్చారు.కాగా ఇతర దేశాలు వదిలేసి వెళ్లిన ఆయుధాలు తాలిబ‌న్ల‌కి చిక్కాయి. అత్యంత అధునాతనమైన ఆయుధాలను వారు సొంతం చేసుకున్నారు. ఇక శిక్ష‌ణ పూర్త‌యిన సంద‌ర్భంగా క‌వాతును నిర్వ‌హించారు. ఈ కవాతులో ఎం117 సాయుధ వాహనాలు, ఎం17 హెలికాప్టర్లు, ఎం4 అస్సాల్ట్ తుపాకుల వంటి వాటిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తాలిబన్ల ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ గతంలో జాతీయ దళాల్లో పని చేసిన పైలట్లు, మెకానిక్ లను ఇప్పుడు తమ సైన్యంలో చేర్చుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు గతంలో కేవలం సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే కనిపించిన తాలిబన్ ఫైటర్లు… ఇప్పుడు మిలిటరీ దుస్తులను ధరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement