టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ నరసరావుపేట పర్యటన ఉత్కంఠభరితంగా మారింది. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న లోకేష్ను ఎయిర్ పోర్టు నుంచి పోలీసులు బయటకు రానివ్వలేదు. విమానాశ్రయం లోపలే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేటలో లోకేష్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెపుతున్నారు. అక్కడి నుంచి లోకేష్ను పోలీసులు ఎక్కడకు తరలిస్తారనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు నారా లోకేష్ వస్తున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని… అక్కడి నుంచి పోలీసు వాహనాల్లో తరలించారు. మరోవైపు టీడీపీ కీలక నేతలందరినీ పోలీసులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. కాగా లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.