Friday, March 29, 2024

కిశోర్ తిరుమ‌ల డైరెక్ష‌న్ లో ‘నాగ‌చైత‌న్య‌’

ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల‌కి ల‌వ్ స్టోరీల‌ను తెర‌కెక్కించ‌డంలో మంచి పేరు ఉంది. ఆయన తాజా చిత్రంగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఈ నెల 25వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కిశోర్ తిరుమల బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన తదుపరి సినిమా హీరో నాగచైతన్యతో ఉంటుందనే విషయం చెప్పాడు. విభిన్నమైన ప్రేమకథాంశంతో ఈ సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నామని అన్నాడు. నాగచైతన్యకి మొదటి నుంచి కూడా ప్రేమకథా చిత్రాలు బాగా కలిసొచ్చాయి. ఆ మధ్య వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమాను అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఇటీవల వచ్చిన ‘బంగార్రాజు’ కూడా ఆయనకి హిట్ తెచ్చిపెట్టింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement