Saturday, April 20, 2024

టెర్రర్ గ్రూప్స్ పై మయన్మార్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్..

ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న తీవ్రవాద గ్రూపులపై మయన్మార్ ఆర్మీ శుక్రవారం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో సహా మయన్మార్ గడ్డపై క్యాంపింగ్ చేస్తున్న ఉగ్రవాద గ్రూపుపై ఈ యాక్షన్ చేపట్టారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గత ఏడాది జరిపిన ఆకస్మిక దాడిలో అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విప్లవ్ త్రిపాఠి, అతని కుమారుడు, భార్య చనిపోయారు.

ఈ ఉగ్రవాద గ్రూపుల స్థావరాలు, వాటి కార్యకలాపాలపై ఇన్‌పుట్‌లు ఇస్తున్న ఇండియా ఏజెన్సీల సమన్వయంతో ఈ ఆపరేషన్ చేపడుతున్నారు. కాగా, ఈ ఆపరేషన్ల సందర్భంగా సరిహద్దులోని భారత భద్రతా బలగాలు కూడా అప్రమత్తం అయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement