Thursday, April 18, 2024

మైనర్‌ బాలికపై మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ అత్యాచారం.. ఫోక్సో, అత్యాచారం కేసుల నమోదు

నిర్మల్‌, ప్రభన్యూస్‌: ప్రజలకు రక్షణగా ఉండే ఓ ప్రజాప్రతినిధి రాక్షసునిగా మారి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులోని మైనర్‌ బాలికను లొంగబర్చుకుని అత్యాచారం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్‌ పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీకి చెందిన మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ తన పదవిని, పలుకుబడిని ఉపయోగించుకుని ఓ మైనర్‌ బాలికను ప్రలోభాలకు గురిచేస్తూ ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి తరచూ అత్యాచారం చేస్తున్నాడని మైనర్‌ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిర్మల్‌ పోలీసులు ఫోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాధితురాలిని పోలీసులు సఖి కేంద్రానికి తరలించారు. ఈ విషయమై పూర్తి దర్యాప్తు చేసి ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. ఈ విషయం గత అర్ధరాత్రి నుండి నిర్మల్‌ జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారడం గమనార్హం.

కొన్ని ప్రధాన పార్టీలు మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవి నుండి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. గత కొంత కాలంగా మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వైఎస్సార్‌ కాలనీలో అరాచకాలకు పాల్పడుతూ తన పదవిని అడ్డుపెట్టుకుని ప్రజలను భయందోళనకు గురిచేస్తున్నాడని స్థానిక ప్రజలు ఆరోపించడం గమనార్హం. దీనికి తోడు కాలనీలో భూకబ్జాలకు పాల్పడుతూ ఇష్టారీతిలో అడ్డగోలుగా అవినీతికి మారుపేరుగా నిలిచారని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఈయన చేసిన భూకబ్జాలపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ప్రజాఫిర్యాదు కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు నేతలు ఫిnర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా సామాజిక మాద్యమాల్లో మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ప్రచారం జరుగడంతో పలు చోట్ల చర్చోపచర్చలు జరుగడం ఇందుకు నిదర్శనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement