Friday, March 29, 2024

MS Dhoni: పాకిస్థాన్ పేసర్ కి ధోనీ గిఫ్టు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సాధారణ ప్రజలే కాదు, పలువురు విదేశీ క్రికెటర్లు కూడా ధోనీని అభిమానిస్తారు. అలాంటివారిలో పాకిస్థాన్ క్రికెటర్ హరీస్ రవూఫ్ ఒకడు. ఇటీవల టీ20 క్రికెట్లో పాకిస్థాన్ జట్టు సాధించిన విజయాల్లో రవూఫ్ కీలకంగా వ్యవహరించాడు. రవూఫ్ కు టీమిండియా మాజీ కెప్టన్ ధోనీ అంటే ఎంతో అభిమానం.

ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాక్ మ్యాచ్ ముగిసిన తర్వాత రవూఫ్.. తన అభిమాన క్రికెటర్ ధోనీని కలిశాడు. అయితే, తాజాగా ధోనీ నుంచి రవూఫ్ కు ఓ గిఫ్ట్ అందింది. ఓ జెర్సీని ధోనీ కానుకగా పంపించాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తాను ధరించే జెర్సీని ధోనీ.. రవూఫ్ కు పంపించాడు. ఈ విషయాన్ని రవూఫ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement