Saturday, April 20, 2024

అమిత్ షాతో ఎంపీ సీఎం ర‌మేష్ భేటీ..

ఢిల్లీలో పార్లమెంటు ప్రాంగణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ భేటీ అయ్యారు. అమిత్ షా కార్యాలయంలో ఆయనను కలుసుకున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జగన్ పాలన గురించి అమిషాకు సీఎం రమేష్ వివరించినట్టు సమాచారం. ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందనే విషయంపై అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఏపీలో బలపడేందుకు బీజేపీ యత్నిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement