Thursday, April 25, 2024

మౌన‌దీక్ష‌లో ఆస‌క్తిక‌ర దృశ్యం.. ప‌క్క ప‌క్క‌నే కూర్చొన్న రేవంత్.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ..

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ మౌన‌దీక్ష చేస్తుంది. హైద‌రాబాద్ లోని ఇందిరా పార్క్ వ‌ద్ద దీక్ష‌కు కూర్చున్నారు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు. అయితే ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. ఎడ మొహం..పెడ‌మొహంగా ఉండే కాంగ్రెస్ టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప‌క్క ప‌క్క‌నే కూర్చొవ‌డ‌మే కాదు..ఏదో విష‌యంపై మాట్లాడుకోవ‌డం విశేషం. అంతే కాదు.. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరికొక‌రు అభివాదం చేసుకున్నారు కూడా.

రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత పార్టీకి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నేటి దీక్షలో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హనుమంత రావు ఒప్పించి మరి ఈ దీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సన్నిహితంగా మెలిగారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ దీక్షలో పాల్గొనడం గమనార్హం. ఈ దీక్ష‌లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement