Thursday, April 25, 2024

మొయినాబాద్ ఫామ్‌హౌస్ బాగోతం.. ఫొరెన్సిక్ టెస్ట్‌కు వెళ్లిన స్వామీజీ ఆడియో టేపులు!

తెలంగాణ‌లో మొద‌లై యావ‌త్ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న ఫామ్‌హౌస్ ఇష్యూ ఆడియో టేపుల విష‌యం ఇప్పుడు ఫొరెన్సిక్ ల్యాబ్ టెస్ట్‌కి వెళ్లింది. కొంత‌మంది స్వామీజీలు టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేలతో సాగించిన బేరసారాలకు సంబంధించిన ఆడియో టేపులను సంబంధిత వర్గాలు ఫొరెన్సిక్‌ ల్యాబ్‌‌కు పంపినట్టు తెలుస్తోంది. ఆడియో టేపులతోపాటు మరికొన్ని ఆడియో, వీడియో టేపులను కూడా ఫొరెన్సిక్‌ ల్యాబ్‌‌కు పంపించారు. అయితే.. వీటి నివేదికలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే రేపు (శనివారం) మరికొన్ని ఆడియో, వీడియోలు బ‌య‌టికి వచ్చే అవకాశం ఉన్న‌ట్టు స‌మాచారం.

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్ర పార్టీ నేత‌ల‌కు తెలియ‌కుండానే నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ కుట్రను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బయటపెట్టగా.. టీఆర్‌ఎస్‌ డ్రామా ఆడుతోందని బీజపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో బీజేపీ తరఫున రామచంద్రభారతి బేరసారాలు జరిపిన ఫోన్‌ సంభాషణకు సంబంధించిన ఆడియోతో పాటు ఎవ‌రు ఎవ‌రితో బేర‌సారాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు. ఎంత పెద్ద మొత్తంలో డీల్ న‌డుస్తోంది అనే రెండో వీడియో కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ అవుతోంది. మొత్తం 27 నిమిషాల నిడివిగల ఈ ఆడియోలో నందు అనే వ్యక్తి రామచంద్రభారతి, సింహయాజి అనే ఇద్దరు స్వామీజీలతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై చేసిన సంభాషణ క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా ఉంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement