Thursday, April 25, 2024

సీఎం జగన్‌ను గజదొంగ అంటారా?: రోజా

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే రోజా తిప్పికొట్టారు. ఏపీకి కేటాయించిన నీళ్లు కాకుండా అదనంగా చుక్క నీళ్లు కూడా వాడుకోవడం లేదనే విషయం ప్రశాంత్‌ రెడ్డి తెలుసుకోవాలని.. ప్రజల మనసుల్లో విషం చిమ్మే ప్రయత్నం చేయటం మంచిది కాదని హితవు పలికారు. ఒక మంత్రి అయి ఉండి సీఎంను గజదొంగ అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని రోజా అన్నారు.

కాగా మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణానదిపై ఏపీ సర్కారు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై మండిపడ్డారు. వైఎస్ఆర్ నీటి దొంగ అయితే.. జగన్ గజదొంగ అని తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement