Thursday, April 25, 2024

రేవంత్ ఓ కమెడియన్.. చిప్ దొబ్బింది.. ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరాలి: బాల్క సుమన్

టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోకర్ లా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ విమర్శించారు. పరిగిలో రేవంత్ కల్లు తాగిన కోతి లా వ్యవహరించారని అన్నారు. వ్యవసాయం గురించి కాంగ్రెస్ మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే అని పేర్కొన్నారు. రేవంత్ కమెడియన్ లా మారిపోయారని, తెలంగాణ సమాజం ఆయనను చూసి నవ్వుతోందని ఎద్దేవా చేశారు. చంచల్ గూడ జైలులో చిప్పకూడు తిన్నప్పటి నుంచి చిప్ దొబ్బినట్లుందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని.. చికిత్సకు అయ్యే ఖర్చును కూడా మేమే భరిస్తామని అన్నారు.

రేవంత్ తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ లేరన్న బాల్క సుమన్.. సమైక్య వాదుల చెప్పులు మోశారని ఆరోపించారు. రేవంత్ నోటి వెంట కుంభ కోణాలు తప్ప మరో పదం రావడం లేదన్నారు. రేవంత్ కు విషయ పరిజ్ఞానం లేదన్నారు. ఈ మధ్య రేవంత్ మాట్లాడిన ఇంగ్లీష్ ను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంగ్లీష్ కు ట్యూటర్ ను పెట్టుకుంటే మంచిదని,  బట్లర్ ఇంగ్లీష్ ను భరించ లేకపోతున్నారన్నారు. సత్య నాదెళ్ల ఏ సంస్థకు ceo నో కూడా రేవంత్ కు తెలియదన్నారు. రేవంత్ కు నాయకుడు అఖిల భారత పప్పు అయితే.. రేవంత్ తెలంగాణకు పప్పుగా తయారయ్యాడని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ ను ఎవ్వరూ పట్టించు కోవడం లేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే రేవంత్ కు ఉరి తాడు బిగించే రోజులు ఎంతో దూరం లేదని హెచ్చించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement