Thursday, April 25, 2024

తమిళనాట కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రమాణస్వీకారం చేశారు. స్టాలిన్‌ తో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కరోనా తీవ్రత దృష్ట్యా నిరాడంబరంగా ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. కూడా స్టాలిన్ తో పాటు మరో 33 మంది మంత్రులు ప్రమాణం చేశారు. కరుణానిధి మంత్రివర్గంలో పని చేసిన వారికి స్టాలిన్ మరోసారి అవకాశమిచ్చారు. ఆయన మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకు స్థానం దక్కింది.

కాగా, ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ఘన విజయం సాధించిన సంగతి విదితమే. 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 133 స్థానాల్లో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement