Thursday, March 28, 2024

కర్నాటక సీఎంకు తప్పిన విమాన ముప్పు.. అరగంట తర్వాత సేఫ్‌ ల్యాండింగ్‌

బెంగళూరు : కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి ప్రమాదం తప్పింది. వీరు ప్రయాణిస్తున్న విమానం ల్యాండయ్యే సమయంలో ఇబ్బంది ఎదురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా అరగంట పాటు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. బెంగళూరు నుంచి హుబ్లికి బయలుదేరిన ఈ విమానం.. ఉదయం 7.30 గంటలకు ల్యాండ్‌ కావాల్సి ఉండగా.. 30 నిమిషాలు ఆలస్యం అయ్యింది.

నేను ఓటు వేయడానికి వచ్చాను.. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణం ఆలస్యమైంది అని బొమ్మై వెల్లడించారు. కర్నాటకలో శాసన మండలి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హవేరీ జిల్లాలోని శిగ్గావ్‌లో సీఎం బొమ్మై శుక్రవారం తన ఓటును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement