Thursday, April 25, 2024

Flash: ఏపీలో మరో ఘోరం.. బాలికపై ఆర్‌ఎంపీ వైద్యుడు అత్యాచారం

ఏపీలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు వెలుగు చూస్తున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి, రేపల్లెలో గ్యాంగ్ రేప్ ఘటనలు మరువకముందే విజయనగరంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. తాజాగా కోనసీమ జిల్లాలో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మామిడికుదురు మండలంలో ఏడో తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిపై ఆర్‌ఎంపీ వేగి రమేశ్‌ వైద్యం చేసేందుకు ఆరు నెలల కిందట బాలిక ఇంటికి వచ్చి ఆమె వద్ద పోన్‌ నెంబర్‌ తీసుకుని పరిచయం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి తండ్రి ఇంట్లో నిద్రిస్తుండగా బాలిక డాబాపై పడుకున్న సమయంలో వైద్యుడు అక్కడికి చేరుకుని బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.  బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement