Friday, April 26, 2024

‘భీమ్లా నాయ‌క్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్ర‌త్యేక అతిథిగా మంత్రి ‘త‌ల‌సాని’

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ కానుంది. కాగా ఈ నెల 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వ‌హించ‌నున్నారు. కాగా ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్టుగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విచ్చేస్తున్నారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మంత్రి తలసాని ప్రత్యేక అతిథిగా వస్తున్నారని చిత్రబృందం వెల్లడించింది. చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టయిన్ మెంట్స్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement