Saturday, April 20, 2024

GHMCలో రూ.5కే భోజనం

జీహెచ్ఎంసీ ప‌రిధిలోని రూ.5 కే భోజ‌న కార్య‌క్ర‌మం ప్రారంభమైంది. గాంధీ ఆస్ప‌త్రిలో రూ.5 కే భోజ‌నం అందించే కార్య‌క్ర‌మాన్ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రోగుల స‌హాయ‌కుల‌కు భోజనం వడించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..పేద‌ల‌ను దృష్టిలో ఉంచుకొని ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం అందిస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను బ‌లోపేతం చేస్తూనే, రోగుల‌కు, వారి స‌హాయ‌కుల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని మంత్రి తలసాని హామీ ఇచ్చారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement