Thursday, April 25, 2024

YSRCP VS TRS: వైసీపీ నేతలపై మంత్రి తలసాని ఆగ్రహం

ఏపీ అభివృద్ధిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య రాజకీయంగా దుమారం రేపాయి. వైసీపీ,టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా ఏపీ వైసీపీ నేతలకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ నేతలు కావాలనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని కాకుండా ప్రపంచ దేశాలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. కేటీఆర్ వ్యాఖ్యలకు అనవసరంగా వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారని పేర్కొన్నారు. ఏపీని తమ కంటే అభివృద్ధి చేస్తే సంతోషమని పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అర్థ రహితమని, బొత్స హైదరాబాద్ వస్తే ఎప్పుడు జనరేటర్ వినియోగించారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. ఏపీలో పవర్ కట్‌పై వాళ్ళే బహిరంగంగా ప్రకటించుకున్నారని చెప్పారు. వైసీపీ నేతల మాటలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement