Thursday, April 18, 2024

Breaking: బాస‌ర ట్రిపుల్ ఐటీకి చేరుకున్న మంత్రి స‌బితా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హామీ

మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇవ్వాల రాత్రి బాస‌ర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. ఆమె వెంట విద్యాశాఖ కార్య‌ద‌ర్శి వాకాటి కరుణ‌, ఇన్‌చార్జి వీసీ రాహుల్ బొజ్జ‌తో పాటు ఇత‌ర అధికారులున్నారు. క్యాంప‌స్‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై విద్యార్థి ప్ర‌తినిధుల‌తో మంత్రి స‌బిత చ‌ర్చిస్తున్నారు.

కాగా, ట్రిపుల్ ఐటీ క్యాంప‌స్‌లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఏడు రోజులుగా విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్నారు. రెండు రోజుల క్రితం క్యాంప‌స్ విద్యార్థుల‌తో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి చ‌ర్చ‌లు జ‌రిపారు. అయినా విద్యార్థులు వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే దాకా ఆందోళ‌న విర‌మించేది లేద‌ని భీష్మించుకున్నారు. దీంతో మంత్రి స‌బితారెడ్డి వారితో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు వెళ్లాల్సి వ‌చ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement