Friday, March 29, 2024

నేతన్నలకు అండగా ఉంటా: మంత్రి రోజా హామీ

చేనేత కార్మికులకు అండగా ఉంటామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆప్కో సమ్మర్ మేళా సందర్భంగా ఆమె ఇవాళ విజయవాడలోని ఆప్కో షోరూమ్ ను సందర్శించారు. మేళాకు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతి ఊరిలోనూ ఆప్కో శాఖలున్నాయన్నారు. ప్రత్యేక ఆఫర్లు, డిజైన్లతో ఆప్కో అందరినీ ఆకర్షిస్తోందని చెప్పారు. అన్ని రకాల కలెక్షన్లు షోరూంలో దొరుకుతాయన్నారు. చేనేత కార్మికుల బాగు కోసం వారి కుటుంబాలకు ఏటా వైసీపీ ప్రభుత్వం రూ.24 వేలు ఇస్తోందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement