Friday, April 19, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ కి విలువ‌లు లేవా – చంద్ర‌బాబుపై – మంత్రి రోజా ఫైర్

మహిళలని చూడకుండా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలని పార్టీ నేతలతో తిట్టిస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును మహిళలు, విద్యార్థులు, రైతులు తరిమికొడతారని అన్నారు. పవన్ కల్యాణ్ తన కార్యకర్తలతో ఏ ఎన్నికలకు, ఏ జెండాను మోయిస్తాడో తెలియని పరిస్థితి ఉందని, పవన్ కల్యాణ్ అభిమానులు ఈ విషయాన్ని గ్రహించాలని ఆమె సూచించారు. అసలు పవన్ కల్యాణ్ ఏ పార్టీకి పనిచేస్తున్నారో తెలియని గందరగోళంలో అభిమానులున్నారన్నారు. చిరంజీవి ఒకప్పుడు సొంతంగా నిలబడి పోటీ చేశారని, ఆ విలువలు పవన్ కు లేవా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లో ముంచేసి వెళ్లారని రోజా విమర్శించారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా వాటికి ఎదురొడ్డి జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న ఒకే ఒక్క సీఎం అని కొనియాడారు.కరోనా, వరదల వంటి సంక్షోభ సమయాల్లోనూ ప్రజలకు అండగా ఉండలేదన్నారు. అప్పుడు సాయం చేయనివాడు.. ఇప్పుడు చేస్తామంటే ఎవరూ నమ్మడం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement