Saturday, April 20, 2024

ఏపీలో కొడాలి నాని.. తెలంగాణలో నేను: కమ్మ సామాజిక మంత్రులపై కుట్ర

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయగణేష్ ఆత్మహత్యపై పరోక్షంగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గం బలహీన పడుతోందని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మంత్రి పదవి పోగొట్టేందుకు నిందలు మోపుతున్నారని వ్యాఖ్యానించారు.

కమ్మ సామాజిక వర్గంలో తనకు మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఏపీలో కమ్మ మంత్రి కొడాలి నానిని తొలగించారు. ఇప్పుడు తెలంగాణలోనూ తనను తొలగించేందుకు తనపై నిందలు మోపి కుట్రలు చేస్తున్నారని పువ్వాడ ఆరోపించారు. కమ్మ సామాజిక మంత్రులపై కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. కమ్మ కులస్తులంతా ఐక్యతగా ఉండాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement