Tuesday, March 26, 2024

మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డికి క‌రోనా

క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏపీలోని రాజ‌కీయ నాయ‌కుల‌ను క‌రోనా వ‌దిలిపెట్ట‌డం లేదు. తాజాగా మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డికి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. ఆయనకు కరోనా సోకడం ఇది రెండో సారి. నిన్ననే క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు మంత్రి మేకపాటి. మాస్క్ లేకుండానే క్యాబినెట్ సమావేశానికి హాజరయ్యారు మంత్రి మేకపాటి. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు మంత్రి మేకపాటి. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు మేకపాటి. అయితే.. నిన్న కేబినేట్‌ కు హాజరైన మంత్రుల్లో ఆందోళన మొదలైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement