Thursday, March 28, 2024

TS | పాల‌మూరులో పర్యటించనున్న మంత్రి కేటీఆర్‌..

మంత్రి కేటీఆర్ ఇవ్వాల (గురువారం) మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఈ సంద‌ర్భంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు భూమిపూజ చేయనున్నారు. కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో మెట్టుగడ్డ- పిల్లలమర్రి రోడ్డులో ఉన్న ఐటీఐ బాలికల కాలేజీ వద్ద చేప‌ట్టిన ఏర్పాట్ల‌ను కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌‌గౌడ్ పరిశీలించారు. ఇక‌.. సెయింట్‌ ఫౌండేషన్‌, శాంతానారాయణగౌడ్‌ చారిటుబల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా ఐటీఐ కళాశాలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాయి.

కాగా, ఈ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో వంద రోజుల పాటు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయ‌నున్నారు. ఈ సెంటర్‌ నిర్మాణానికి కేటీఆర్‌ భూమిపూజ చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు మూసాపేట మండలం వేములలో కోజెంట్ పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. ఆ తర్వాత పద్మావతి కాలనీ అయ్యప్ప గుట్ట సమీపంలో నిర్మించిన ఆధునిక వైకుంఠ ధామాన్ని ప్రారంభిస్తారని, తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు జడ్చర్లలో డబుల్‌ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement