Friday, April 19, 2024

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి కేటీఆర్ సాయం

మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. ఆపదలో వున్నవారికి సాయం చేయడం కంటే పెద్దపని ఏదీ లేదని భావించి బిజీ షెడ్యూల్ లోనూ ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడేందుకు తాపత్రయపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్ర శివారులో ఔట‌ర్ బైపాస్ రోడ్డుపై, మెడిక‌ల్ కాలేజీకి స‌మీపంలో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు ప్ర‌మాద‌వ‌శాత్తు డివైడ‌ర్‌ను ఢీకొట్టారు. దీంతో వారికి గాయాల‌య్యాయి. ఈ స‌మ‌యంలో అటువైపుగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ కాన్వాయ్ వెళుతున్న‌ది. జ‌రిగిన ప్ర‌మాదాన్ని చూడ‌గానే కారు దిగారు. త‌న కాన్వాయ్‌లోని రెండు కార్ల‌లో గాయ‌ప‌డిన ఆ ఇద్ద‌రు క్ష‌త‌గాత్రుల‌ను సిద్ధిపేట ప్ర‌భుత్వ ఆస్పత్రికి పంపారు. వారితోపాటు త‌న పీఏ మ‌హేంద‌ర్‌రెడ్డి, ఎస్కార్ట్ పోలీసుల‌ను పంపించడమే కాదు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ లో  సూచించారు.   ఆపదలో వున్నవారిని కాపాడి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు కేటీఆర్. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో వున్న తమవారిని కాపాడిన మంత్రి కేటీఆర్ కు క్షతగాత్రుల కుటుంబసభ్యులు, బంధువులు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement