Friday, April 19, 2024

KTR: డబుల్‌ బెడ్రూం ఇండ్లు.. నిరుపేదలకు కానుక

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా డబుల్ బెడ్ రూంలు నిర్మించి ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని కోరుట్ల పేటలో నిర్మించిన 16 డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధి దారులకు గృహ ప్రవేశాలు చేయించారు. ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను అన్ని సౌకర్యాలతో నిర్మించి ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో వేల కోట్లు వెచ్చించి నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇచ్చి వారి కళ్ళల్లో ఆనందం చూడడంలో వున్న సంతృప్తి ఇచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి టిఅర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతుందని తెలిపారు. రైతులకు రైతు బంధు,రైతు భీమా పథకాలతో అందిస్తున్నామన్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిరుపేదలకు సీఎం కేసీఆర్‌ ఇస్తున్న కానుక అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement