Saturday, April 20, 2024

ఎమ్మెల్యే సాయన్న మృతికి మంత్రి కేటీఆర్ సంతాపం..

కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న మృతికి ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాయన్న కంటోన్మెంట్‌ ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించారని, ఆయన మృతి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. పలువురు మంత్రులు సైతం సాయన్న మృతికి సంతాపం ప్రకటించారు. సాయన్న మృతిపై మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, అల్లోల‌ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు పలువురు నేతలు సంతారం ప్రకటించారు. ఎమ్మెల్యే సాయన్న మరణం బాధాకరమన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు సాయన్నకు ఉందన్నారు. ఎప్పుడూ ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించే వారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement