Friday, April 19, 2024

వివోఏల సమస్యల పరిష్కారాని కృషి.. టీఆర్ఎస్ లో భారీగా చేరికలు

అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆఎస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కల్యాణ మండపంలో ఐకేపి విఓఏలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సంరద్భంగా వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమం చూసే ప్రతిపక్షాల నాయకులతో పాటు పలు సంఘాలు గులాబీ గూటికి చేరుతున్నాయన్నారు. వివోఏల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రామగుండం శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమత, వివోఏల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement