Wednesday, April 17, 2024

చెత్త మనుషుల చెత్త ఆలోచనలు: రేవంత్ కు మంత్రి కౌంటర్

తనపై మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌పై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చెత్త మనుషులకు చెత్త ఆలోచనలే ఉంటాయని రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అసలు అలాంటి విషయాలపై మాట్లాడాల్సిన అవసరమే లేదని జగదీశ్ రెడ్డి  తెలిపారు. కరోనా కట్టడితో పాటు తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగం మెరుగుపడటానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని జగదీశ్ రెడ్డి చెప్పారు.

మంత్రి జగదీశ్ రెడ్డి కుమారుడి పుట్టిన రోజు వేడుకలను కర్ణాకటలోని హంపిలో జరిపినట్టు, ఆ వేడుకలకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారంటూ ఓ ఆంగ్ల పత్రిక నిన్న కథనం ప్రచురించింది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఆలోచనలపై ఆ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు అందులో పేర్కొంది. ఇప్పటికే ఈటలపై వేటు పడడంతో.. తర్వాతి వేటు పడేది జగదీశేనా? అన్న కోణంలో వార్తను ప్రచురించింది. ఈటల రాజేందర్‌పై వేటు వేసిన సీఎం కేసీఆర్.. ఆ తరువాత మంత్రి జగదీశ్ రెడ్డిను టార్గెట్ చేశారంటూ ఇంగ్లీష్ పత్రిక కథనాన్ని ప్రచురించడం కలకలం రేపింది.

ఆ కథనాలను ట్వీట్ చేసిన రేవంత్.. ‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’.. కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం.. యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా? అని పేర్కొన్నారు. నేరుగా చెప్పకపోయిన ఈ ట్వీట్‌లో పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement