Saturday, April 20, 2024

తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్‌ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం

తెలంగాణలో ఈ-హెల్త్ ప్రొఫైల్‌ను పైలెట్ ప్రాజెక్టును వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ములుగు జిల్లాలో ముగ్గురు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పర్యటిస్తున్నారు. ములుగు గట్టమ్మ ఆలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ఆస్పత్రి భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ములుగు ఏరియా ఆస్పత్రిలో రేడియాలజీ ల్యాబ్, పిడియాట్రిక్ యూనిట్ ప్రారంభోత్సవం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement