Thursday, April 18, 2024

నూతన జిల్లా ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో రూ 56.80 కోట్ల రూపాయలతో నిర్మించే ఆస్పత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. జిల్లా అసుపత్రి, 50 పడకల సమీకృత ఆయుష్ వైద్యశాల భవననిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతోపాటు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ దయాకర్, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్,  స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement