Tuesday, March 26, 2024

ఒకే చోట మంత్రి హ‌రీశ్ రావు..బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్

నిత్యం విమ‌ర్శ‌లు చేసుకునే టీఆర్ ఎస్..బిజెపి పార్టీల‌కి చెందిన మంత్రి హ‌రీశ్ రావు..ఎమ్మెల్యే రాజాసింగ్ లో ఒకే చోట క‌నిపించి సంద‌డి చేయ‌డం విశేషం. హైద‌రాబాద్లోని ఉస్మానియా ఆసుప‌త్రిలో గురువారం జ‌రిగిన ఓ అధికారిక కార్య‌క్ర‌మంలో ఈ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం క‌నిపించింది. స్మానియా ఆసుపత్రిలో రోగి సహాయకుల కోసం ఏర్పాటు చేసిన మూడు పూటలా భోజన పథకాన్ని గురువారం హోం మంత్రి మ‌హ‌మూద్ అలీతో క‌లిసి హ‌రీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి స్థానిక ఎమ్మెల్యే హోదాలో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజా సింగ్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజా సింగ్‌తోనే హ‌రీశ్ రావు రిబ్బ‌న్ క‌టింగ్ చేయించారు. ఇప్పుడు ఈ ఫొటో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement