Friday, April 26, 2024

మంత్రి అవంతి శ్రీనివాస్ కి క‌రోనా

క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ఎంతో మంది సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే ప‌డ్డారు. కాగా పొలిటిషియ‌న్స్ కూడా వ‌రుస‌గా క‌రోనాకి బ‌లి అవుతున్నారు. కాగా రీసెంట్ గా ఏపీ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. కాగా త‌న‌కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో క‌రోనా టెస్ట్ చేయించుకోగా క‌రోనాగా నిర్థార‌ణ అయింద‌ని వెల్ల‌డించారు. దీంతో త‌న ఇంట్లో నే ఐసోలేష‌న్ లో ఉన్నట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారంద‌రూ క‌రోనా నిర్ధార‌ణ పరీక్ష‌లు చేసుకోవాల‌ని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ కోరారు. అలాగే ల‌క్ష‌ణాలు ఉన్న వారు క్వారైంటెన్ లో ఉండాల‌ని విజ్ఞాప్తి చేశారు. అలాగే రాష్ట్ర ప్ర‌జ‌లు అంద‌రూ కూడా క‌రోనా, ఓమిక్రాన్ ప‌ట్ల జగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. అంద‌రూ కూడా రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ ను తీసుకోవాల‌ని అన్నారు. మాస్క్ ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement