Thursday, March 28, 2024

ఏపీలో ఆ స్కూళ్లు బంద్!

తెలుగురాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా స్కూళ్లు, విద్యాసంస్థల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. తాజాగా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. కొవిడ్‌ కేసులు వెలుగుచూసిన విద్యాసంస్థలు మూసేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రణాళికతో చర్యలు తీసుకోవడంతో విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టినట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కేసులు పెద్ద సంఖ్యలో నమోదైన విద్యాసంస్థలను వెంటనే మూసివేయాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున సంక్షోభం తలెత్తినపుడు కొంత నష్టం తప్పక ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రాజమండ్రిలోని ప్రైవేటు కళాశాలలో 168 మందికి కరోనా సోకిందని తెలిపారు. కరోనా సోకిన వారిని ప్రాథమికంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  విద్యార్థులకు కరోనా టెస్టులు పెంచుతామని మంత్రి మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement