Tuesday, April 23, 2024

Surface Pro X టాబ్లెట్ రిలీజ్ చేసిన మైక్రోసాఫ్ట్..

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ Surface Pro X స్మార్ట్ టాబ్లెట్ ను విడుదల చేసింది. 13 అంగుళాల స్మార్ట్ టాబ్లెట్ గా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ పరికరాన్ని బ్లూటూత్ కీ బోర్డు అటాచ్ చేసి లాప్ టాప్ గానూ ఉపయోగించుకోవచ్చు.

భారత్ లో మొత్తం 3 వేరియంట్లలో లభించనున్న ఈ Surface Pro X ప్రారంభ ధర రూ.93,999గా ఉండగా.. 8GB/128GB వేరియంట్ ధర రూ.94,599 గానూ.. 16GB/512GB వేరియంట్ ధర రూ.1,50,499 గానూ ఉంది. ఇప్పటివరకు వచ్చిన Surface టాబ్లెట్ లలో ఇదే అత్యంత సన్నని టాబ్లెట్ గా మైక్రోసాఫ్ట్ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement