Saturday, April 20, 2024

‘అమ్మా.. నీ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నా’: మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్

కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే, ఈ రోజు చిరంజీవి తల్లి పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు.  “అమ్మా !జన్మదిన శుభాకాంక్షలు క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ.. అభినందనలతో …. శంకరబాబు:” మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

కాగా, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ రోజు తన మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement