Friday, April 26, 2024

మేడారంకి వేలాదిగా తరలివచ్చిన భక్తులు

తాడ్వాయి ప్రభన్యూస్ : ఆదివాసీల ఆరాధ్య దైవంగా భావించే మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకునేందుకు వేలాదిగా తరలి వచ్చి తల్లులను దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాలైన హైదరాబాద్, నల్గొండ,కరింనగర్, ఖమ్మం, అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ ,రంగారెడ్డి, నుండే కాకుండా,ఛతీష్ ఘడ్ ,జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భక్తులు తరలివచ్చారు. ముందుగా భక్తులు జంపన్నవాగులో పుణ్య స్థానాలు ఆచరించి.. గద్దెల వద్దకు చెరుకుని పసుపు, కుంకుమ, పూలు, పండ్లు నూతన వస్త్రాలు, ఎత్తు బెల్లం, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.అనంతరం జాతర పరిసర ప్రాంతాలైన మ్యూజియం, సారలమ్మ గుడి,చిలుకలగుట్ట ప్రాంతంలో కలియ తిరిగారు, కుటుంబం సమేతంగా వచ్చిన భక్తులు కోళ్లను, మేకలను, గొర్రెలను తల్లులకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులు, ఎలాంటి ఇబ్బందులూ తలేత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement