Tuesday, April 16, 2024

Breaking : మ‌రియ‌మ్మ లాకప్ డెత్ పై హైకోర్టులో విచార‌ణ‌..

అడ్డ‌గూడూరు మ‌రియ‌మ్మ లాక‌ప్ డెత్ పై నేడు హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. మ‌రియ‌మ్మ మృతిపై గ‌తంలో హైకోర్టుకు నివేదిక స‌మ‌ర్పించింది మెజిస్ట్రేట్. నేడు హైకోర్టుకు సీబీఐ ఎస్పీ హాజ‌రుకానున్నారు. ఈ కేసు పూర్తి వివ‌రాల‌ను అసిస్టెంట్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ కు అప్ప‌గించింది ఏజీ. సీ బీ ఐ,కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌తివాదిగా హైకోర్టు చేర్చింది. గ‌త విచార‌ణ‌లో మ‌రియ‌మ్మ కేసును సీబీఐకి అప్ప‌గిస్తామ‌ని కోర్టు తెలిపింది. మ‌రియ‌మ్మ లాక‌ప్ డెత్ పై నేడు హైకోర్టు విచార‌ణ కీల‌కం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement