మావోయిస్టులు..భద్రతా బలగాల మధ్య భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పులు కొనసాగుతుండగానే నక్సల్స్ ముందే పాతిపెట్టిన మందుపాతరను పేల్చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఇవాళ మధ్యాహ్నం సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు సంయుక్తంగా నక్సలైట్ల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా నక్సల్స్ తారసపడటంతో రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. అదే సమయంలో నక్సల్స్ మందుపాతర పేల్చడంతో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాస జిల్లాలో చోటు చేసుకుంది.
మావోయిస్టులు.. భద్రతా బలగాల మధ్య భారీ ఎన్ కౌంటర్.. సీఆర్పీఎఫ్ జవాన్లకి తీవ్ర గాయాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement