Thursday, April 18, 2024

Breaking: ఐఈడీ పేల్చిన మావోలు.. ఇద్దరు జవాన్లకు గాయాలు

మావోయిస్టులు ఐఈడీ మందుపాతరను పేల్చడంతో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలైన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో చోటుచేసుకుంది. బీజాపూర్‌ జిల్లాలోని పుస్నార్‌, గంగలూరు మధ్య మావోయిస్టులు మందుపాతర (IED) పేల్చారు. ఈ ఘటనలో 85వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి. గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రాథమిక చికిత్స అనంతరం హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌ జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ ఆంజనేయ వర్షిణి ధృవీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement