Friday, March 29, 2024

Breaking: ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం.. ఇన్​ఫార్మర్​ పేరిట వ్యక్తి దారుణ హత్య

తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల అలజడి మళ్లీ మొదలయ్యింది. చాలాకాలంగా సైలెంట్​గా ఉన్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న (బుధవారం) అర్ధరాత్రి ములుగు జిల్లాలో ఓ దారుణ ఘటన జరిగింది. పోలీసులకు సమాచారం అందిస్తున్నాడన్న కారణంగా ఓ వ్యక్తిని గొడ్డళ్లతో నరికిచంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ములుగు జిల్లా వెంకటాపురంలో మావోయిస్టులు రెచ్చిపోయారు, ఇన్​ఫార్మర్​ అనే నెపంతో కొండాపూర్​కు చెందిన గోపాల్​ అనే వ్యక్తిని బుధవారం రాత్రి దారుణంగా హతమార్చారు. గొడ్డలితో దాడి చేయగా గోపాల్​ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు పోలీస్​ ఇన్​ఫార్మర్లకు ఇదే గతి పడుతుందని మావోయిస్టులు ఓ లేఖ కూడా వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారే.

Advertisement

తాజా వార్తలు

Advertisement