Thursday, April 25, 2024

‘మా’ పోరులో మరో ట్విస్ట్: ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక మలుపు తిరిగింది. ‘మా’ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని మంచు విష్ణు అన్నారు. ఈవీఎంలపై తమ ప్యానెల్ సభ్యులకు నమ్మకం లేదన్నారు. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఈసారి మా పోలింగ్ నిర్వహించాలని కోరారు. పేపర్ బ్యాలెట్ విధానంలో జరిగే పోలింగ్ లో పారదర్శకత ఉంటుందన్నారు. ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్ చాలా ఉత్తమమైనదని పేర్కొన్నారు. పేపర్ బ్యాలెట్ కల్పిస్తే సీనియర్లు చాలా మంది ఓటు వేసే అవకాశం ఉంటుందని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement