Saturday, April 20, 2024

ప్రియురాలిపై కత్తితో దాడి.. కానీ ప్రియుడు మృతి

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జబితాపూర్‌లో ఓ యువ‌తిపై క‌త్తితో దాడిచేసిన ప్రేమోన్మాది.. అదే క‌త్తితో త‌న‌ను తాను కోసుకున్నాడు. యువ‌తి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండ‌గా.. దాడికి పాల్పడ్డ యువ‌కుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల భవాని.. మేడిప‌ల్లి మండ‌లం మ‌న్నెగూడెంలోని అమ్మమ్మ ఇంట్లో ఉండేది. అక్క‌డే పదో తరగతి వరకు చదువుకుంది. అదే గ్రామానికి చెందిన‌ రాజ్ కుమార్ కూడా అదే స్కూల్‌లో చ‌దువుకున్నాడు. ఈ క్ర‌మంలో ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డారు.

కాగా రాజ్ కుమార్ ఉపాధి నిమిత్తం నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. కానీ చెయ్యి విర‌గ‌డంతో స్వ‌గ్రామానికి తిరిగి వ‌చ్చాడు. గ‌త‌ తొమ్మిది నెలలుగా ఊర్లోనే ఉంటున్నాడు. రాజ్ కుమార్ దుబాయ్‌లో ఉన్నప్పుడు భవానితో చాటింగ్ చేసే వాడ‌ని సమాచారం. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్పర్ద‌లు రావ‌డంతో శ‌నివారం జాబితా అత‌డు భ‌వానీపూర్ వెళ్లిన రాజ్‌కుమార్ యువ‌తిపై క‌త్తితో దాడిచేశాడు. అనంత‌రం త‌న గొంతు కోసుకున్నాడు. దీంతో స్థానికులు వారిని ఆస్పత్రికి త‌ర‌లించారు. క‌రీంన‌గ‌ర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్‌కుమార్ ఆదివారం ఉదయం మ‌ర‌ణించాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement