Tuesday, April 23, 2024

మైనర్ బాలిక అత్యాచారం కేసులో యువకుడికి 17 ఏళ్ల జైలు శిక్ష

బాల్కొండ, (ప్రభన్యూస్): మైనర్ బాలిక అత్యాచారం కేసులో బాల్కొండ మండలం బూచేపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి నరేష్ అలియాస్ నర్సారెడ్డికి 17 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి పంచాక్షరి శుక్రవారం తీర్పునిచ్చారు. 2015 డిసెంబర్ 31 న జ‌రిగిన ఘ‌ట‌న‌పై ఈ కేసు న‌మోదు అయ్యింది. ఇంటి పక్కనే ఉన్న ఓ బాలిక షాపుకు వెళ్ల‌గా.. నరేష్ ఆమెను పట్టుకొని అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలికి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కాగా, బాధితురాలు మరణ వాంగ్మూలంలో నిందితుడి వివరాలను వెల్లడించింది. అంతేకాకుండా కోర్టు విచ‌రాణ‌లో అత్యాచార నేరం రుజువు కావడంతో బొబ్బిలి నరేష్ అలియాస్ నర్సారెడ్డికి శిక్ష విధిస్తూ జ‌డ్జి తీర్పునిచ్చారు. జరిమానా కట్టకుంటే మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువ‌రించార‌ని బాల్కొండ ఎస్సై కర్తన్ చంద్రమోహన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement