Thursday, April 18, 2024

చాక్లెట్ ఆశ చూపాడు.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. చాక్లెట్ ఆశ చూపించి మూడేళ్ల చిన్నారిపై ఓ 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు వయసు ఆరేళ్లు, కూతురి వయసు ఎనిమిదేళ్లు. అయితే అతని భార్య , పిల్లలు శుభకార్యానికి వెళ్ళారు. ఇంటిలో ఒక్కడే ఉండడంతో ఎదురింటికి చెందిన ఓ పసిపాప ఆడుకుంటూ కనిపించింది. దీంతో చాక్లెట్‌ ఇస్తానని ఆ చిన్నారికి ఆశ చూపాడు. ఆమె నవ్వుతూ అతడితో పాటు ఇంట్లోకి వెళ్లింది.

చిన్నారి ఏడుస్తూ తన ఇంటికి వెళ్లింది. ఏమైందని కుటుంబసభ్యులు అడగగా తాను ఏం చెప్పలేదు. చిన్నారికి తీవ్రంగా రక్తస్రావం కావడంతో వారి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి ఆత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందుతున్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement