Friday, March 29, 2024

Breaking: ORRపై లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

హైదరాబాద్ శివారు ప్రాంతమైన హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న  ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది.

శంషాబాద్ నుండి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఐదుగురు యువకులు కాగా.. ఓ యువతి ఉన్నట్లు చెప్పారు. కారు ముందు సీటులో ఇరుకున్న ఓ యువతిని.. అతి కష్టంగా బయటకు తీసుశారు.

మద్యం సేవించి కారు నడుపుతున్నట్లు గుర్తించారు. కారులో మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు. మితి మీరిన వేగం, మద్యం మత్తులో కారు నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు ప్రేమ్, కాశీనాథ్, గగన్, గోశాల్, అమిత్ కుమార్, వైశ్వవిగా గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement