Tuesday, March 26, 2024

Bengaluru: రోడ్డుపై గుంతలు, బైకుపైనుంచి పడి వ్యక్తి మృతి.. విచారణ జరుపుతున్న పోలీసులు

బెంగళూరులో బైక్‌పై నుంచి పడి 44 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మొన్న (ఆగస్టు 18వ తేదీ గురువారం) జరిగింది. అయితే.. బైకు గుంతల్లో పడడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటన బ్యాదరహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాగా, కుటుంబసభ్యుల ఆరోపణపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలో అతడు రోడ్డుపై పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే, స్పాట్‌లో ఎలాంటి గుంతలు లేవని, ఈ 44 ఏళ్ల వ్యక్తి మరణానికి కారణమైన గుంత ప్రమాదం జరిగిన ప్రదేశానికి కాస్త దూరంలో ఉందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అతను ఫోన్‌లో మాట్లాడుతున్నాడని, బైక్​ని ఒక చేత్తో నడుపుతున్నాడని తెలిపారు. కానీ, ప్రమాదానికి గుంతలే కారణమన్న కుటుంబీకుల ఆరోపణలపై కూడా విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement