Friday, April 19, 2024

Shame: అక్రమ సంబంధాన్ని నిలదీసిన పాపం.. భర్తను ప్రాణం ఉండగానే గోనెసంచిలోపెట్టి కాల్చేసిన మహిళ

భార్య అక్రమ సంబంధం, కూతురు లవ్​ ఎఫైర్​ని నిలదీసినందుకు తల్లీకూతుళ్లు ఇద్దరు కలిసి ఓ వ్యక్తిని ప్రాణం ఉండగానే గోనెసంచిలో పెట్టి కాల్చేసిన ఘటన తమిళనాడులో జరిగింది. టుటికోరిన్ జిల్లా కోవిల్‌పట్టిలో ఇవ్వాల (ఆదివారం) ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కోవిల్​పట్టి అడవుల్లో ఒక వ్యక్తి మృతదేహం కాలిపోయిన స్థితిలో చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ డెడ్​బాడీ విషయంపై ఆరా తీయగా.. తల్లీ కూతుళ్ల బాగోతం బయటపడింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

భార్య, కుమార్తె కలిసి ఓ వ్యక్తిని కొట్టి, గోనె సంచిలో పెట్టి కాల్చేశారు. కాలిపోయిన మృతదేహాన్ని కోవిల్​పట్టి అడవుల్లో పారవేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శవపరీక్షకు తరలించారు. బాధితుడిని 42 ఏళ్ల జ్ఞానశేఖర్‌గా గుర్తించి, అతడు చేపలు అమ్మేవాడని పోలీసులు తెలిపారు.

జ్ఞానశేఖర్​ భార్య, తన ఇద్దరు కుమార్తెలైన 14,  15 సంవత్సరాల వయస్సు గల వారి నుండి పరస్పర విరుద్ధమైన సమాధానాలు పోలీసులకు అనుమానాన్ని రేకెత్తించాయి. వారిని మరింత లోతుగా విచారించడంతోపాటు.. వారి ఇరుగు పొరుగువారి నుండి వివరాలు సేకరించారు. అయితే.. శనివారం భార్యకు అతనికి మధ్య పెద్ద గొడవే జరిగిందని పోలీసులకు తెలిసింది.

భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో పాటు తన పెద్ద కుమార్తె కార్తీక్ అనే 24 ఏళ్ల యువకుడితో ఎఫైర్​ పెట్టుకుందని తెలుసుకున్న జ్ఞానేశేఖర్​కు వారికి మధ్య గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ గొడవ పెరగడంతో ఆ వ్యక్తి తన భార్యతో పాటు కుమార్తెను  గట్టిగా మందలించాడు. చివరికి ఆ గొడవ అతని ప్రాణాలమీదికి తెచ్చింది.  నిందితులు కార్తీక్ సహాయంతో జ్ఞానశేఖర్‌ను గోనె సంచిలో చుట్టి కాల్చివేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement