Thursday, April 25, 2024

మేజ‌ర్ చిత్రానికి – U/A సర్టిఫికెట్

ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క తెర‌కెక్కిస్తున్న చిత్రం మేజ‌ర్.ఈ చిత్రంలో అడివి శేష్ తో పాటు సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమా నిర్మాణంలో మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్లు పాలుపంచుకున్నాయి. ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవుతోంది.ముంబాయి చరిత్రలో మరిచిపోలేని ఘటన తాజ్‌మహల్‌ అటాక్.. అయితే.. ముంబాయి ఉగ్రదాడుల అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాథ ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘మేజర్’. అడివి శేష్ ఇందులో మేజర్ సందీప్ గా నటించాడు. ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ‘మేజర్’ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసినట్లు.. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ పేర్కొంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement