Thursday, April 18, 2024

ర‌ష్యా మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అండ్రీ సుఖోవిట్ స్కీ హ‌తం !

ఉక్రెయిన్ పై యుద్ధంలో ర‌ష్యాకు చెందిన మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అండ్రీ సుఖోవిట్ స్కీని ఉక్రెయిన్ సేన‌లు హ‌తం చేసిన‌ట్టు స‌మాచారం.
ఈ మేరకు బెలారస్ మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. ఉక్రెయిన్‌‌‌‌లో రష్యా విధ్వంసం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం ఆపేందుకు ఇతర దేశాలు సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఈ యుద్ధం మాత్రం ఆగడం లేదు. కాగా.. ఉక్రెయిన్ లోని నగరాలను స్వాధీనం చేసుకునే దిశగా.. రష్యా చర్యలు చేపట్టింది. కాగా.. ఇప్పటికే దక్షిణాన క్రిమియాకు దగ్గర్లో ఉన్న పోర్ట్ సిటీ ‘ఖెర్సన్’ను రష్యన్ దళాలు ఆక్రమించుకున్నాయి. భీకర యుద్ధం తర్వాత ఉక్రెయిన్‌‌‌‌లోని ఓ మేజర్ సిటీని రష్యా తమ అధీనంలోకి తెచ్చుకుంది.ఉక్రెయిన్ లోని అతి పెద్ద నగరం ఇదే కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement